వికసిత భారత్ మహిళలు లేకుంటే సాధ్యం కాదు: చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0
15 Views

అనంతగిరి డెస్క్ : నరేంద్ర మోడీ కలలు కంటున్న 2047 కల్లా వికసిత భారత్ మహిళలు లేకుంటే సాధ్యం కాదని చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నారీ శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ రాష్టం బరసత్ నుండి వర్చువల్ గా మాట్లాడారు ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మరియు జౌలి శాఖ సహాయ మంత్రి దర్శన విక్రమ్ జర్డోష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ,మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ,ప్రధాన కార్యదర్షి సమతా , రాష్ట్ర కార్యదర్శి సాహు శ్రీలత , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి , అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు , డివిజన్ అధ్యక్షులు మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు