డీకే శివ కుమార్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ

0
19 Views

అనంతగిరిడెస్క్:పార్లమెంట్ ఎన్నికల వేల బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరుగా కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. అయితే గురువారం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్ భేటీ కావడం సంచలనంగా మారింది.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిసింది.