మంత్రి జూపల్లి కారుపై రాళ్ల దాడి – సొంత పార్టీ కార్యకర్తల నిరసన

0
317 Views

అనంతగిరి డెస్క్ గద్వాల : మంత్రి జూపల్లి కృష్ణారావు కారుపై సొంత పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన గద్వాల జిల్లాలో జరిగింది, జూపల్లి కృష్ణారావు రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తున్న సమయంలో తన కారును అడ్డుకొని కార్యకర్తలు దాడి చేశారు.

జూపల్లి డౌన్ డౌన్ అంటూ నిరసన తెలుపుతూ, కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడికి ప్రధాన కారణం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు కాగా జూపల్లి సరిత తిరుపతయ్య ఇంటికి వెళ్తుండగా, మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్లిపోయిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ పరిణామానికి కారణమని భావిస్తున్నారు.

ఈ సంఘటన తర్వాత, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.