వికారాబాద్ గౌడ సంఘం ఆద్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

0
339 Views

వికారాబాద్:తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగులాయి దౌర్జన్యలకు ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నాయకులు మల్లికార్జున్ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్ లు పేర్కొన్నారు . ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్బంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి గౌడ కులస్తులతో కలిసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ . గోల్కొండ కోటాను పరిపాలించి బహుజనుల కోసం పోరాడడం జరిగిందన్నారు . చత్రపతి శివాజీకి సమకాలికుడని ఆయన ఒక్క గౌడ కులస్తులకే చెందిన వారు కాదన్నారు. అందకి స్వేచ్చకోసం పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో వెంకటయ్య గౌడ్ , శ్రీహరిగౌడ్, వెంకటేశం గౌడ్ , ప్రవీణ్ గౌడ్ _ శేఖర్ గౌడ్ , ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.