వికారాబాద్ మున్సిపల్ లో గుంతలను పూడ్చిన బీజేపీ నాయకులు

0
170 Views

వికారాబాద్:మునిసిపల్ దర్బార్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 31,32 వ వార్జులో బీజేపీ నాయకులు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చారు. ఆదివారం బీజేపీ జిల్లా నాయకుడు బొత్స శ్రీకాంత్ ఆధ్వర్యంలో కాలనీ రోడ్లపై డస్ట్ పోసి రోడ్లను బాగు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవరెడ్డి , పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, నాయకులు రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శరణరెడ్డి, పోకల సతీష్ , శ్రీధర్ రెడ్డి పాల్గొనగా బొత్స శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ పాలకవర్గం మునిసిపల్ రోడ్లను పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. కాలనీలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.