ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో కాపీికి పాల్పడిన 9 మంది విధ్యార్థులు డీబార్:జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్

0
16 Views

వికారాబాద్:ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా ఎనిమిదవ రోజు కుల్కచర్ల లోని రెండు పరీక్షా కేంద్రాలలో కాపీ చేస్తున్న 9 మంది విద్యార్థులను తెలంగాణ ఇంటర్ బోర్డు పరిశీలకులు డీబార్ చేసినట్టు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్.శంకర్ తెలిపారు. అయితే జనరల్ కోర్సులలో 5124 మంది విద్యార్థులకు గాను 5016 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ కోర్సులలో 1273 మంది విద్యార్థులకు గాను 1228 మంది విద్యార్థులు హాజరయ్యరని ఆయన తెలిపారు.