చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నే గెలిపించుకుందాం:బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమ కారుడు మంచన్ పల్లి సురేష్

0
17 Views

వికారాబాద్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మొట్టమొదటిసారి బడుగు బలహీనవర్గాల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని ఎంపిక చేసిన కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమ కారుడు మంచన్ పల్లి సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోసపూరిత మాటలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 6 గ్యారంటీల హామీలతో అనతి కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందన్నారు. మళ్లీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రైతులకు రైతుబంధు లేక ఇబ్బంది పడుతున్నారని పార్టీని ఎవరు వీడిన నష్టం లేదని అధికారం ఎక్కడుంటే అక్కడ వెళ్లే నాయకులకు ఈ ప్రాంత ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని మళ్లీ టిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించుకుంటామని తెలిపారు….