డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: కేఎల్ఆర్

0
122 Views

వికారాబాద్:మహేశ్వరం నియోజకవర్గాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా తయారు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని డ్రగ్ కంట్రోల్, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, పోలీసులు సమన్వయంతో పనిచేసి డ్రగ్స్, గంజాయి అమ్మే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యార్థులు సైతం ఉన్నతమైన లక్ష్యం పెట్టుకుని మద్యానికి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు కేఎల్ఆర్.సమాజంలో పెరుగుతున్న క్రైమ్ కు కారణం డ్రగ్స్, మద్యమేనన్నారు కిచ్చెన్నగారు. త్వరలో తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా యువత, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని లక్ష్మారెడ్డి అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు బాగా చదువుల్లో రాణించి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కేఎల్ఆర్ ఆకాంక్షించారు.