నిర్మలమైన మనస్సుతో అక్క చెల్లెళ్లకు తోడుగా ఉండాలి:తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
86 Views

వికారాబాద్ : నిర్మలమైన మనస్సుతో అక్కచెల్లెలకు తోడుగా ఉండాలని రక్షబంధన్ తెలియజేస్తుందని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్  పట్టణంలోని ఓంశాంతిభవనంలో నిర్వహించిన రక్షాబందన్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనగా మదు అక్కయ్య స్పీకర్కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ. అన్నదమ్ములు అక్కచెల్లెళ్లకు తోడుగా ఉండాలని సూచించారు. ఓంశాంతి భవనంలో బ్రహ్మకుమారిలు మంచి బోధన చేస్తారని, ఇక్కడికి వస్తే విజ్ఞానం పెరిగి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాన కేంద్రానికి వచ్చి మంచి విషయాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ గోపాల్, ఎర్రవల్లి జాఫర్, బ్రహ్మకుమారి మదు అక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.