వికారాబాద్ జిల్లాలో మిరాకల్: తాండూర్‌లో రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన

0
402 Views

వికారాబాద్:(తాండూర్):వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నావంగి రైల్వే స్టేషన్లో ఆదివారం జరిగిన ఒక ఆగంతుక ఘటన ఆశ్చర్యపరిచింది. తాండూర్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలు మధ్యలో నుంచి ముగ్గురు వ్యక్తులు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. వారిలో ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా దాటినప్పటికీ, ట్రైన్ కదిలే సమయంలో ఒక మహిళ పట్టాల మధ్యలో నిలిచిపోయింది.దగ్గరలో ఉన్న ప్రయాణికులు ఆ మహిళకు ధైర్యం ఇచ్చి, పట్టాలపై పడుకోమని సూచించారు. ఆ మహిళ కూడా వెంటనే ఆ సూచనను పాటించి, పట్టాల మధ్యలో పడుకుంది. రైలు వెళ్లిన తర్వాత, ఆమె ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడింది.ఈ సంఘటనను చూసిన వారంతా ఆ మహిళ ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ ఘటన అక్కడే ఉన్న ప్రయాణికుల ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

*ఇది నిజంగా అదృష్టం* అని అక్కడున్న వారు పేర్కొన్నారు. “ఆ మహిళ ధైర్యానికి సెల్యూట్,” అని పలువురు వ్యాఖ్యానించారు.