పార్లమెంట్ ఎన్నికల్లో నోడల్ అధికారులదే కీలక పాత్ర: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

0
9 Views

వికారాబాద్ : రానున్న పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకై నియమించిన నోడల్ అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ హాలు నందు ఎస్ పి , అడిషనల్ ఎస్ పి , అదనపు కలెక్టర్ లతో కలిసి సంబంధిత నోడల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో నోడల్ అధికారులందరూ వారికి కేటాయించిన అంశాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలని కోరారు. అన్ని విషయాలపై నోడల్ టీములకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని శిక్షణ నోడల్ అధికారి కి ఆదేశించారు. మొదటి ర్యాండైజేషన్ తర్వాత పిఓ, ఏపీఓలకు సైతం శిక్షణ ఏర్పాటు చేయాలన్నారు. .ఎన్నికల సామాగ్రికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి నోడల్ అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఎన్నికల సామాగ్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎన్నికల మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి, డి డబ్ల్యు ఓ కు ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ లో భాగంగా అవసరమైన వాహనాల ఏర్పాటు, అంతర్రాష్ట్ర సరిహద్దులలో ,జిల్లా సరిహద్దు చెక్ పోస్టు లలో సిబ్బంది ని ఏర్పాటు చేయాలని, ఇందులో పోలీస్ ,ఆర్టీవో, ఆర్టీసీ, ఎక్సైజ్ ఉద్యోగులను నియమించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల యాప్ లతో పాటు, ఎంసీఎంసీ, సి- విజిల్ పై కంప్యూటరైజేషన్ ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలని, కంప్యూటరైజేషన్ నోడల్ అధికారి కి ఆదేశించారు .పట్టణ స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, ముఖ్యంగా వలస కూలీలు, దివ్యాంగులు, మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని, ప్రత్యేకించి హోం ఓటింగ్ పై సరైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా స్వీప్ నోడల్ అధికారికి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ ల ఏర్పాటు, సెక్టోరల్ అధికారుల నియామకం, తదితర విషయాలపై దృష్టి సారించాలని అదనపు ఎస్పి కొట్టిరెడ్డి తో కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 24 గంటలు, 42 గంటలు, 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తూ ముందుకువెళ్లాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి నోడల్ అధికారి కి , ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ వీటన్నిటి పై సంబంధిత నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మీడియా నిర్వహణ, పెయిడ్ న్యూస్ తనిఖీ చేయడం ,ప్రకటనల ముందస్తు అనుమతి వంటి వాటిపై మీడియా నోడల్ అధికారి దృష్టి సారించాలన్నారు. కమ్యూనికేషన్ ప్లాన్ రూపొందించడం, ఓటరు జాబితా తయారు పై సంబంధిత నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సందర్భంగా వచ్చే ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరించడం , సి విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించి పరిష్కరించాలని సంబంధిత అధికారికి ఆదేశించారు. ఎన్నికలలో అక్రమాల నివారణకు ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, టీంలు కృషి చేయాలని తెలిపారు. ఎఫ్ ఎస్ టి వి ఎస్ టి, ఎస్ ఎస్ టి, వి వి టి, ఎం సి సి టీంలకు వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా ఎస్సి పి కోటి రెడ్డి మాట్లాడుతూ జిల్లా లో ఉండే చెక్ పోస్టుల దగ్గర సి సి కెమెరాలు ఏర్పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 24 గంటలు, 42 గంటలు, 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై ,ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తూ ముందుకు సాగాలని ,పోలీస్ సిబంది విధి నిర్వహణ లో ఎలాంటి పొరపాట్లు జరుగ కుండ చూడాలని, ఎన్నికల నియమ నిబంధనల పై పూర్తి అవగాహనా కలిగి ఉండాలనీ పోలీస్ సిబంద్ది కి ఆదేశించారు.
సమావేశం లో రెవెన్యూ అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ , లింగ్యా నాయక్ , అదనపు ఎస్పీ కోటి రెడ్డి, డి ఎస్ పి తాండూర్ ఆర్ డి ఓ శ్రీనివాసులు , ,నోడల్ అధికారులు , తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.