తిరుపతి లడ్డూ కల్తీ పై వికారాబాద్ జిల్లా కేంద్రం లో 30 న నిరసన:విశ్వ హిందూ పరిషత్

0
95 Views

వికారాబాద్:తిరుపతి లడ్డూ కల్తీ పై వికారాబాద్ జిల్లా కేంద్రం లో 30 న నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బందెప్ప గౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా
తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ కల్తీ వివాదంపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి , దేవాదాయ శాఖను వెంటనే రద్దు చేయాలి తదితర డిమాండ్లతో VHP రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 30 న ఉదయం 10 గం, స్థానిక రామమందిరం నుండి NTR చౌరస్తా వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం లో వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని విశ్వ హిందూపరిషత్ జిల్లా అధ్యక్షులు బందెప్ప గౌడ్ , S. ప్రశాంత్ కుమార్ జిల్లా కార్యదర్శి తూర్పు శ్రీలతా రెడ్డి పేర్కొన్నారు.