బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా శ్రీదేవి

0
13 Views

వికారాబాద్: బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా వికారాబాద్ మునిసిపల్ కౌన్సిలర్ శ్రీదేవిని రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షులు శిల్ప రెడ్డి నియమించారు. రాష్ట్ర నూతన కమిటీలో భాగంగా శ్రీదేవికి అవకాశం ఇవ్వగా శ్రీదేవి భర్త సదానందారెడ్డి సైతం మొన్నటి వరకు వికారాబాద్ జిల్లా అధ్యక్ష బాద్యతలను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర నాయకులుగా కొనసాగుతున్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించడం సంతోషంగా ఉందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో గెలుపొందే విధంగా కృషి చేయడం జరుగుతుందని శ్రీ దేవి తెలిపారు.