ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ల మొదటి స్థాయి పరిశీలన:జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
36 Views

వికారాబాద్:ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ల మొదటి స్థాయి పరిశీలనను ఎన్నికల కమిషన్ అదనపు కార్యదర్శి , ఎఫ్ ఎల్ సి పరిశీలకులు ఎ.మల్లారెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తో కలిసి పరిశీలించారు. గురువారం పట్టణంలోని ఈవీఎం గిడ్డంగిలో భద్రపరిచిన, ఈవీఎం, వివి ప్యాట్ మొదటి విడత పరిశీలన ప్రక్రియలో చేపడుతున్న వివరాలను సాంకేతిక నిపుణులను అదనపు కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ఎల్సి లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డిఓ విజయకుమారి, తహాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.