సంచలన వ్యాఖ్యాలు చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి…. పరిగిలో తొలి ప్రెస్ మిట్

0
13 Views

అనంతగిరి డెస్క్ (పరిగి ) : మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిఅన్నారు. మంగళవారం పరిగి నియోజకవర్గంలో పర్యటించి స్థానిక ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 5 సంవత్సరాలు పార్టీలకు అతీతంగా నేను పనిచేసుకుంటూ వచ్చాను. కొన్ని పనులు చేశాను మిగిలిన పనులు చేయాల్సి ఉంది. ఎంత మంచిగా అభివృద్ది చేస్తే అంతా అవుతుందని. అభివృద్ది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అధిష్టానం ఎంపీ టిక్కెట్ ఇస్తే అందరూ సహకరిస్తే భారీ మేజార్టీతో గెలుస్తాను. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాలన్నారు. విద్య, వైద్య పరంగా మరింత అభివృద్ది చేయాలన్నారు. ప్రజలకు ఎప్పుడుఅందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.