రంజిత్ రెడ్డి గుడ్లు పంచడం తప్ప ఏమి చేయలేదు: మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్

0
15 Views

తాండూరు : రంజిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ గెలిపించి ఎంపీ చేస్తే, ఆయన మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం తాండూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.  రంజిత్ రెడ్డి స్థానికుడు కాకపోయిన కేసీఆర్ ఆదేశాల మేరకు గెలిపించడం జరిగిందన్నారు. ఆయన ఈ ప్రాంతానికి చేసింది ఏమి లేదని కేవలం గుడ్లు పంచడం జరిగిందన్నారు. అదే విధంగా విశ్వేశ్వర్ రెడ్డి దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని మండ పడ్డారు. బీసీ నేత కాసానిని గెలిపించుకుంటామని, రోహిత్ రెడ్డి పార్టీ మారేది లేదని బీఆర్ఎస్ తోనే ఉంటారని ఆయనతో మేము ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.