బడా బాబులను వదిలి నిరుపేదల పై హైడ్రా జులుం:బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మంచన్ పల్లి సురేష్

0
47 Views

వికారాబాద్:బడా బాబులను వదిలి నిరుపేదల పై హైడ్రా జులుం చూపిస్తుందని, చెరువులు నదులు పరిరక్షణ పేరుతో నిరుపేదల నివాసాలను కూల్చివేస్తూ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుందని బడా బాబులను వదిలిపెట్టి ప్రజా ప్రతినిధుల అక్రమ కట్టడాలను వదిలిపెట్టి అమాయకులైన నిరుపేదల పై మీ జులం సరికాదని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంచన్ పల్లి సురేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అనేక అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హైడ్రా సమక్షంలో నదులను చెరువులను కాపాడాలనే ఉద్దేశాన్ని స్వాగతిస్తున్నామని కానీ నిరుపేద బాధితులకు తగిన ప్రత్యామ్నాయని చూపించి వారి సహకారంతో ముందుకు వెళ్లాలనిసూచించారు. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన అనేక అక్రమ కట్టడాలను వదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా బాధితులకు సమాచారం ఇవ్వకుండా ప్రత్యయం చూపించకుండా నిర్దాక్షణంగా ఇల్లు కూల్చివేయడం సరైన పద్ధతి కాదనిహెచ్చరించారు.మీరు ఇలాగే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజా పోరాటాలకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల పై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు ఇలాంటి చర్యలకు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని అన్నారు. ఒక వైపు హైకోర్టు బాధితులకు సమయం ఇవ్వాలని సూచన చేసిన పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని లేనిపక్షంలో ప్రజా అగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.