అనంతగిరి దేవాలయ భూమిలో మరో సారి అక్రమార్కులు అడ్డుకున్న ఎండోమెంట్ అధికారులు

0
13 Views

వికారాబాద్ : అనంతగిరి దేవాలయ భూముల్లో కొందరు అక్రమార్కులు మరోసారి చొరబడి రోడ్డు వేసేందుకు ప్రయత్నించారు. గతంలోనూ ఈ అక్రమార్కులు దేవాలయ భూమిలో రోడ్డు వేసి ఎందుకు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న ఎండోమెంట్ అధికారులు అట్టి రోడ్డు పనులను నిలిపివేసి మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించినప్పటికీ అక్రమార్కులు వారి మాట లెక్కచేయకుండా మరోసారి రోడ్డు పనులు చేపట్టడంతో ఎండోమెంట్ అధికారులు అక్కడికి చేరుకొని రోడ్డు పనులను ఆపివేశారు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆనంపల్లిలో సర్వేనెంబర్ 2లో 2.13 విస్తీర్ణంలోనీ ఆలయ భూమిలో నుంచి కొందరు అక్రమార్కులు రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా దేవాలయ ధర్మకర్త ఎండోమెంట్ అధికారులు అక్కడ చేరుకొని జెసిబి సహాయంతో అట్టి రోడ్డును తొలగించారు.