వికారాబాద్ (బంట్వారం ) : గత కొన్ని నెలల క్రితం మాలసోమారం సర్పంచ్ నరసింహ రెడ్డి ని సర్పంచుల సంఘం అధ్యక్షునిగా బంట్వారం మండల సర్పంచులు ఎన్నుకున్నారు. కాగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సూచనల మేరకు నూతన సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా తలారి నర్సిములను నియమించాలని ఆ తరువాత అభివృద్దికి సహకరిస్తానని మాట ఇవ్వడంతో సర్పంచులు నరసింహ్మ రెడ్డికి బదులుగా నర్సిములను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. అనంతరం గత మూడు రోజులు క్రితం సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ నర్సింహులు అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలవగా ఎమ్మెల్యే మాట మార్చడం జరిగిందని, తనపై ఇంకా నమ్మకం లేదని చెప్పారని నమ్మకం రావాలంటే ఏం చేయాలని సర్పంచ్ నర్సింహులు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. పట్నం కుటుంబానికి దగ్గర ఉన్నందుకే నిధులు ఇస్తాలేనని ప్రతి సందర్భంలో అంటున్నారని బంట్వారం మండలానికి ఎమ్మెల్యే చేసింది ఏమి లేదని పట్నం కుటుంబంమే బంట్వారం మండల అభివృద్దికి నిధులు కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శనివారం ఎమ్మెల్యే మాట తప్పినందున సుల్తాన్పూర్ సర్పంచ్ నర్సింలు తన మద్దతును విరమించుకొని తిరిగి మాల సోమారం సర్పంచ్ నరసింహ రెడ్డి ని సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా ఎన్నుకొని శాలువాతో సన్మానించారు.
ఎమ్మెల్యే మాట మార్చారు…. మేము అధ్యక్షుడిని మారుస్తాము… బంట్వారం సర్పంచుల తీర్మాణం
36 Views