పట్నం ఫామిలీ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప మహపడిపూజ

0
20 Views

తాండూర్: ‘పట్నం’ ఫామిలీ ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు పట్టణం అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజ ఘనంగా జరిగింది. పట్నం వారసుడు రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహపడిపూజ లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి , తనయ పట్నం మనీషా రెడ్డి  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, అయ్యప్ప స్వామి మాలదారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు , స్వాములకు అన్నదానం చేశారు.