పాఠశాలలో క్షుద్ర పూజలు

0
21 Views

వికారాబాద్ : ఇన్ని రోజులు అడవుల్లో గ్రామ శివారులో కనిపించే క్షుద్ర పూజలు ఇప్పుడు పిల్లలు చదువుకునే పాఠశాలలకు చేరుకున్నాయి . వికారాబాద్ జిల్లా, వికారాబాద్ మండలం మైలార్ దేవరం పల్లి గ్రామ ఉన్నత పాఠశాలలోో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఆదివారం సోమవారం వరుసగా సెలవులు రావడం తో కొందరూ పాఠశాలలోని 9వ తరగతి గదిలో కుంకుమ పసుపు నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు నిర్వహించారు. దీంతో మంగళవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కన్పించడంతో భయాందోళనకు గురయ్యారు . వెంటనే ఉపాధ్యాయులకు సూచించడంతో వారు గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డికి సమాచారం అందించారు. దీంతో సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం .