ఎన్ వై కే ఎస్ జిల్లా అడ్వైజరీ బోర్డు మెంబర్ గా పసుల మహేష్

0
26 Views

వికారాబాద్:నెహ్రూ యువకేంద్ర సంఘటన్ జిల్లా అడ్వైజరీ బోర్డు మెంబర్ గా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్ ఖోడ గ్రామానికి చెందిన పసుల మహేష్ ను మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్, స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ భాద్యత ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని, విద్యార్థి స్థాయి నుంచి అఖీల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి యువత పట్ల, విద్యార్థుల పట్లా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నా అని అన్నారు. ఈ ఎంపిక కు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.