మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

0
215 Views

వికారాబాద్(కోట్పల్లి): భార్య కాపురానికి రాలేదని మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన కోట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై స్రవంతి తెలిపిన వివరాలు ప్రకారం మోత్కుపల్లి గ్రామానికి చెందిన బేగరి నర్సింలు(42) భార్య హేమలతలు గత కొన్ని రోజులు గా హైదరాబాదులో కూలి పని చేస్తూ జీవనం గడిపేవారు గత 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చారు. డబ్బుల విషయంలో భార్య గొడవ పడి హైదరాబాద్ వెళ్ళిపోయింది. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు . మృతుడి తమ్ముడు ఆనందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, వికారాబాద్ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. మృతుతిడికి ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయికి వివాహం కాగా చిన్నమ్మాయి దివ్య పదవ తరగతి చదువుతుంది.