ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
29 Views

వికారాబాద్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజా సమస్యలపై 205 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.