అనంతగిరిపల్లి లో ఘనంగా బొడ్రాయి వివిధ ప్రతిష్టాపన ఉత్సవాలు..వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
21 Views

వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి లో నూతన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం స్థానిక కౌన్సిలర్లు దేవిరెడ్యా నాయక్, జైదిపల్లి మురళి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం గ్రామంలో బొడ్రాయి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై పూజలు నిర్వహించారు. స్పీకర్ ను కౌన్సిలర్లు సన్మానించారు. సోమవారం బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఉండడంతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వికారాబాద్ మునిసిపల్ చైర్మన్ మంజుల రమేష్ ,గ్రామ పెద్దలు యు అనంతయ్య ,యు బాగయ్య ,రాజు నాయక్, రెడ్డిశేఖర్ ,నర్సింలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు