16 Views
వికారాబాద్:వేదిక్ గణిత పోటీల్లో యం. ఆదిత్య ప్రథమ స్థానం సాధించినట్లు వేదిక్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు మురళి ప్రసాద్ తెలిపారు. ఆదివారము మహబూబ్ నగర్ జోన్ లో , 7 జిల్లాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు వేదిక్ గణిత పోటీల్లో పాల్గొనటం జరిగిందని వికారాబాద్ జిల్లా నుంచి పోటీల్లో పాల్గొన్న వేదిక్ ఉన్నత పాఠశాల విద్యార్థి యం. ఆదిత్య వేదిక్ గణిత పోటీల్లో తన ప్రతిభ చాటి ప్రథమ స్థానం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రథమ స్థానం సాధించిన ఆదిత్యను పాఠశాల యాజమాన్యం, , ఉపాధ్యాయ బృందం తోటి విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు.