ప్రజావాణి లో వచ్చిన ధరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి:జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0
38 Views

వికారాబాద్:ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ (LB) అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజా సమస్యలపై 125 ఫిర్యాదులను అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ (LB) స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్పి సీఈవో జానకి రెడ్డి లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.