హైదరాబాద్ నాదర్గుల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో దారుణం…విద్యార్థినిపై పిటి సార్ లైంగిక వేధింపులు

0
30 Views

అనంతగిరి డెస్క్: హైదరాబాద్ నాదర్గుల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పిటి సార్ లైంగిక వేధింపులు. నెల రోజుల క్రితమే పిటి సార్ పై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు, పట్టించుకోని యజమాన్యం. పోలీసులు ఆశ్రయించిన తల్లిదండ్రులు. నిందితుడు ప్రకాష్ ను అరెస్టు చేసిన పోలీసులు.ఎక్కడ తమ పాఠశాల పరువు పోతుందొనని స్కూలుకు చెడ్డ పేరు వస్తుందని గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్క దిద్దిన పాఠశాల యజమాన్యం. స్కూల్ చైర్మన్ కొమురయ్య ఒక పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ తన రాజకీయ ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందోనని ఇలాంటి వ్యవహారాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను నాణ్యమైన విద్యను అందిస్తారని ఆశతో లక్షలకు లక్షలు ఫీజ్ కట్టి పాఠశాలలో చదివిస్తుంటే యజమాన్యం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా డబ్బే ప్రధానంగా ముందుకెళ్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి సంఘటనలే కాకుండా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు కూడా అప్పుడప్పుడు దర్శనమిస్తున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.ఇలాంటి ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.