సునితమ్మను కలిసిన జడ్పి కొత్త సీఈఓ, డిప్యూటీ సీఈఓ

0
13 Views

వికారాబాద్: జడ్పి కొత్త సీఈఓ సుధీర్ , డిప్యూటీ సీఈఓ వసంత గురువారం హైదరాబాద్ లోని సునితమ్మ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించారు. ఈ సందర్భంగా అధికారులతో జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. ప్రత్యేకించి జడ్పి పనుల విషయంలో పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. వేసవి వస్తునందున జిల్లాలో ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. గ్రామ పంచాయతీలల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉన్నందున ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి దిశానిర్ధేశం చేయాలని సూచించారు