రేపు కాంగ్రెస్ లోకి ‘పట్నం’ సునీతారెడ్డి!

0
64 Views

వికారాబాద్: తెలంగాణ రాష్ట్రం పున:నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డి సారత్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తన కుమారుడు పట్నం రినీష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గాంధీభవన్ లో శుక్రవారం(16 ఫిబ్రవరి 2024) మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ దీపాదాస్ మున్షీ  , గౌరవ సీఎం రేవంత్ రెడ్డి   సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. ‘పట్నం’ ఫ్యామిలీ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సునిత రెడ్డితో  పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లానుంచి భారీగా అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సునితమ్మతో పాటు కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 11:00 గంటల వరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నివాసానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇంటి నుంచి గాంధీ భవన్ కు కార్యకర్తలు తో భారీ ర్యాలీగా బయలు దేరి కాంగ్రెసులో చేరుతున్నట్లు ప్రకటించారు.