ఒకే సారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించింన వికారాబాద్ అమ్మాయి పావని.

0
11 Views

వికారాబాద్:వికారాబాద్ రామయ్య గూడ కు చెందిన దుద్యాల పావని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించింది. తల్లి చంద్రమ్మ ఓ మెడికల్ కాలేజీలో స్విపర్ గా పని చేస్తూ కష్టపడి చదివించింది. దానికి ఫలితంగా హార్నిశలు శ్రమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. గురుకుల బోర్డు నిర్వహించిన ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నే కాకుండా ఇంటర్వ్యూ, మరియు డెమో లో నెగ్గి వావ్ అనిపించింది. ఏకంగా నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించింది. 1) డిగ్రీ లెక్చరర్. 2) జూనియర్ లెక్చరర్. 3) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్.4) ట్రెయిండ్ గ్రాడ్యుయేట్ టీచర్ గా అర్హత సాధించిది.