జిల్లాలో నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి,IPS

0
23 Views

వికారాబాద్:జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని మార్చి 31 వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి  తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజా ధనానికి నష్టం కలిగే ఏం విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని ఎస్పీ  తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించాలని, అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ  తెలియజేసారు.