రాజీ మార్గమే రాజమార్గం:జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి

0
75 Views

వికారాబాద్:కేసుల రాజీ కుదుర్చుకునేందుకు ఈ నెల 28న జిల్లాలోని కోర్ట్ లలో న్యాయ శాఖ ఆద్వర్యం లో లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు ఎవరైనా తమ కేసుల రాజీ కొరకు వేచిచూస్తున్నట్లు అయితే 28న న్యాయ వ్యవస్థ లోక్ అదాలత్ ద్వారా కల్గించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 28న జిల్లాలోని అన్నీ కోర్ట్ లలో లోక్ అదాలత్ కార్యక్రమం ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థ అధికారుల ఆధ్వర్యం లో కేసులు రాజీ చేయడం జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నవారు రాజీ కావాలి అనుకుంటే తమ స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. రాజీ మార్గమే రాజ మార్గమని, కేసులలో రాజీ అవ్వాలనుకున్నావారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.