జిల్లాలో 87938 మందికి పల్స్ పోలియో చుక్కలు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పల్వన్ కుమార్

0
21 Views

వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా 545 పోలియో బూత్ ల ద్వారా 87938 ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు 93% శాతం పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పల్వన్ కుమార్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మరో రెండు రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది గృహ సందర్శన చేసి పోలియో చుక్కలు వేసుకోకుండా తప్పిన 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేస్తారన్నారు. కాబట్టి తల్లితండ్రులు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు మరియు పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి కోరారు.