మేడ్చల్ జిల్లా సాయి ప్రియ కాలనీలో ఇళ్ళ కూల్చివేత.. ఉద్రిక్తత!

0
23 Views

మేడ్చల్ : మేడిపల్లి మండలం పీర్జాదిగూడ సాయి ప్రియా కాలనీలో మంగళవారం రెవెనూ అధికారులు భారీ పోలీస్ బందోబస్త్ మధ్య పలు నిర్మాణాలు కూల్చివేత కార్యక్రమం చేపట్టగా ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు భాదితులు సాలర్జంగ్ కంచ సర్వే నంబర్ 1, 10, 11లో సిలింగ్ భూమిలో కొన్ని సంవత్సరాల క్రితం మోసపోయి తెలియకుండా భూమి కొన్నారు. అప్పటినుండి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 118 జీవోలో వీరి సమస్యలు తొలగి పొతాయానుకొంటే, సీలింగ్ ల్యాండ్లో అప్పటికే నిర్మాణంలో ఉన్నవాటికి మాత్రమే 118 జీవో అమలవుతుందని తెలపడంతో కొందరు వారు కొన్న సీలింగ్ ల్యాండ్లో అప్పట్లో నిర్మాణాలు చేపట్టారు. మిగతా వాటిని మంగళవారం ఉదయం రెవెనూ సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. గతంలో ఇంటి నంబర్లు ఇస్తామంటే కొందరికి చందాలు వేసుకుని కోట్లలో డబ్బు ముట్టజెప్పామని తక్షణమే కొత్త ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని.. జీవో 118ను సవరించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.