సీఎం సమక్షంలో చేరిన చేరిక చెల్లదు తెల్చి చెప్పిన వికారాబాద్ కాంగ్రెస్

0
25 Views

వికారాబాద్ :  పైన ఫోటోలో కనిపిస్తున్న మర్పల్లి మండలం పంచలింగల్ గ్రామానికి చెందిన BRS నాయకుడు. కోహిర్.శంకర్ రెడ్డి కొద్దీరోజుల క్రితం సీఎం నివాసం వద్ద ఎంపీ. జి రంజిత్ రెడ్డి  ఆధ్వర్యంలో మహేశ్వరం , రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమంలో వారి గుంపులో కలిసి సీఎం  చేత కండువా కప్పుకోవడం జరిగిందని వికారాబాద్ కాంగ్రెస్ పేర్కొంది. కాని మండల కాంగ్రెస్ కమిటీకి గాని నియోజకవర్గ MLA కు తెలియకుండా కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టిస్తు చేసిన ఇలాంటి చర్యలని వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగనిస్తూ ఈ చేరిక చెల్లదని ఇకపై ఇలాంటి పనులకు ఎవరైనా ఉపక్రమిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ కోహిర్.శంకర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది..ఈ అసంబద్ద చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ విషయంపైన జిల్లా కాంగ్రెస్ కమిటీ(DCC)  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC )కి ఫిర్యాదు చేశారు. పై విషయన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు గమనించగలరని తెలిపారు.