ఉపాధ్యాయుడు నర్సింహులు మృతిపట్ల శుభప్రద్ పటేల్ సంతాపం

0
34 Views

వికారాబాద్: తెలంగాణ ఉద్యమ కారుడు, రచయిత, కవిగాయకుడు, ఉపాధ్యాయుడు నర్సింహులు మరణం పట్ల రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పటేల్ సంతాపాన్ని తెలిపారు. నర్సింహులు పార్ధివదేహానికి వికారాబాద్ డెవలప్మెంట్ ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ , నాయకులు పెండ్యాల అనంతయ్య , దత్తు , శంకర్ తో కలిసి పూలమాల వేసి నివాళులార్పించారు. తెలంగాణ ఉద్యమంలో నర్సింహులు క్రియాశీలకంగా పాల్గొన్నారని వారి కృషిని శుభప్రద్ పటేల్ స్మరించుకున్నారు. వారి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు శుభప్రద్ పటేల్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.