కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే…రెండు మూడు రోజుల్లో మరో ముగ్గరు

0
45 Views

అనంతగిరి డెస్క్: కాంగ్రెస్ పార్టీలో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరగా త్వరలో మరి కొంత  మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా నుంచిమరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకోగా మరో రెండు మూడు రోజుల్లో వారు కూడా హస్తంగూటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే జీహెఛ్ఎంసీ బేటికి సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి హాజరు కాక పోవడంతో వారు కాంగ్రెస్ పార్టీకి వెళుతారనే ప్రచారం జరుగుతుంది.