బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

0
38 Views

వికారాబాద్ (మర్పల్లి) : మర్పల్లి మండల పరిధిలోని షాపూర్ తండా కు చెందిన బాణావత్ జిమి బాయ్ అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందడం జరిగింది. తండా వాసుల ద్వారా అట్టి విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి గారు బుధవారం మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల కు 5 వేల రూపాయలు పంపించారు. స్థానిక నాయకులు గ్రామస్తులతో కలిసి మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..