కాంగ్రెస్ రైతు ప్రభుత్వం : బంట్వారం మండల కాంగ్రెస్ ఇన్ చార్జి రత్నారెడ్డి

0
108 Views

బంట్వారం : రైతు ప్రభుత్వం కాంగ్రెస్ అని రైతుల కోసం ఆలోచిస్తుందని బంట్వారం కాంగ్రెస్ మండల ఇంచార్జ్ రత్నారెడ్డి అన్నారు. గురువారం బంటారం రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అందరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలభిషేకం నిర్వహించి మాట్లాడుతూ. 10 సంవత్సరాలు కేసీఆర్ రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశారని కానీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేశం, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు శాకం నరసింహులు తదితరులు పాల్గొన్నారు.