పట్టణంలో బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

0
274 Views

వికారాబాద్: హర్ ఘర్  తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు   బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో స్కూటీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు యాస్కి శిరీష తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎంఆర్ పీ చౌరస్తా వరకు స్కూటీ లపై జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ. మహిళలు ఎందులోను తక్కువ కాదనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చ నాయకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.