ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు బాధ్యతారాహిత్యం:ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్

0
155 Views

వికారాబాద్:ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు బాధ్యతరహిత్యం అని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్ అన్నారు. ఇందిరా పార్కు వద్ద జరుగుతున్న సేవ్ దామగుండం నిరసన కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా నుండి బయలుదేరిన మద్దతుదారులను ఉద్దేశించి వై మహేందర్ మాట్లాడుతూ దామగుండం సమస్య పైన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కనీసం అవగాహన లేకుండా ప్రాజెక్టు మీద ఎలాంటి సమాచారం లేకుండా ప్రెస్ మీట్ పెట్టి వికారాబాద్ జిల్లా ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు 12 లక్షల చెట్లు పోతున్నట్లు నేవీ అధికారులు కోర్టుకు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు పబ్లిక్ నోటీసు ఒకసారి పరిశీలన చేసుకోవాలన్నారు.
గొర్లు బర్లు మేకలు పోయి అడవులను నాశనం చేస్తున్నాయని మాట్లాడడం విడ్డూరంగా ఉంది జిల్లాలో పశువులు అడవుల్లో మేత మేయకుంటే ఎక్కడ మేయాలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి  సమాధానం చెప్పాలన్నారు.
ఈ ప్రాజెక్టును ఇంత అడవిని విధ్వంసం చేసి 12 లక్షలు చెట్లను కొట్టి వేసి ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఏమిటో చెప్పలేదు వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ తో వికారాబాద్ జిల్లాకు స్థానిక ప్రజలకు ఏమి ఉపయోగం జరుగుతుందో చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ముదిరాజ్, సుబానయ్య, రాజేష్ ముదిరాజ్, సుభాష్, రవి యాదవ్, ప్రవీన్ , మహేష్, మాణిక్యం ,శంకర్ నాయక్, శ్రీకాంత్, రమేష్ కుమార్ పూడూర్ గ్రామ ప్రజలు ఉన్నారు.