వికారాబాద్ లో ప్రారంభమైన శ్రీవారి బ్రహోత్సవాలు

0
96 Views

వికారాబాద్: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువావారం ధ్వజారోహణం నిర్వహించిన ఆలయ నిర్వాహకులు అనంతరం స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో నిత్య కల్యాణ కార్యక్రమంతో పాటు శ్రీవారి వాహన సేవ కార్యక్రమాలు సాయంత్రం సమయంలో నిర్వహించనున్నారు. ఈ నెల 11న జరిగే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరు కానున్నట్లు ఆలయ ధర్మకర్త పగడాల లక్ష్మీ నారాయణ తెలిపారు.