మృతుడి అంత్యక్రియలకు ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

0
114 Views

వికారాబాద్: మర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రస్ కార్యకర్త గొల్ల మొగులయ్య గురువారం సాయంత్రం ఆకస్మాత్తు గా మృతి చెందాడు. శుక్రవారం గ్రామస్తుల ద్వారా అట్టి విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి గారు మృతుడి అంత్యక్రియల కు 5 వేల రూపాయలు పంపించారు. స్థానిక నాయకులు నల్ల అబ్రహం, ఉప్పరి రమేశ్ గ్రామస్తులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్ల ప్రభాకర్, వడేలా బ్రాహ్మచారీ, రమేష్ రెడ్డి, ఎల్లప్ప, రాంచంద్రారెడ్డి, దాసు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.