208 Views
వికారాబాద్ (మర్పల్లి) : మర్పల్లి మండల పరిధిలోని చిట్టెంపల్లి తండా నుండి పెద్దపూర్ చౌరస్తా వరకు భారీ వర్షాలతో రోడ్డు పై గుంతలు పడి ప్రమాదకరంగా ఉండడం తో అటువైపు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న మర్పల్లి మండల brs పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి తన సొంత డబ్బులతో రోడ్డు మరమ్మతులు చేపట్టారు. రూ. 50 వేలు ఖర్చు చేసి రెడ్ మిక్స్ వేసి రోడ్డు పై ఉన్న గుంతలను పూడ్చివేయించారు. శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి రోడ్డు మరమ్మతులు చేయించడంతో అటువైపు వెళ్తున్న ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.