అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి:బీజీపీ జిల్లా అద్యక్షుడు కే మాదవరెడ్డి

0
116 Views

వికారాబాద్:అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి అని బీజీపీ జిల్లా అద్యక్షుడు కే మాదవరెడ్డి శనివారం డిఎంహెచ్ఓ మెమరాండం అందజేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  వికారాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మామూలుగా కాళ్ల నొప్పులని, సర్ది, జ్వరం, వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే అక్కడ డెంగి వచ్చింది మీకు అని, మలేరియా వచ్చిందని, చికెన్ గునియా వచ్చిందని, డబ్బులు విపరీతంగా వసూలు చేస్తూ మోసం చేస్తున్నారని వివరించారు.ఇక ప్రభుత్వ హాస్పిటల్స్ కు వస్తే డాక్టర్స్ తొమ్మిది నుండి నాలుగు గంటల వరకు హాస్పటల్లో ఉండాలి. కానీ ఏదో నామమాత్రంగా రెండు గంటలు హాస్పిటల్లో ఉండి, తర్వాత ప్రైవేటు హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వివేకానంద రెడ్డి, రాజేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కేపి రాజు, జిల్లా కార్యదర్శి బుస్స శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, అమర్నాథ్, డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.