MCMC మీడియా సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
14 Views

వికారాబాద్:పార్లమెంట్ ఎన్నికలు వెలువడిన నేపథ్యములో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి,మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ (ఎం సి ఎం సి), మీడియా సెంటర్ ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు . మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎం సి ఎం సి పనితీరును సంబందించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సంబందించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ, సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ లింగ్యా నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారిణి చెన్నమ్మ, ప్రభాకర్, డి.పి.ఆర్ . ఓ. కార్యాలయ సిబ్బంది సతీష్ ,తదితరులు పాల్గొన్నారు.