తెలంగాణ చలన చిత్ర సెన్సార్ బోర్డు సభ్యుడిగా జిల్లావాసి ఎంపిక …

0
31 Views

వికారాబాద్ :తెలంగాణ చలనచిత్ర సెన్సార్ బోర్డు సభ్యుడిగా జిల్లాకు చెందిన విద్యావేత్త సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్ సి. వేణుగోపాల రావు ఎంపిక అయ్యారు …. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చక్రవర్తుల వేణుగోపాల్ రావు సామాజిక కార్యకర్త ,కవి, పాటల రచయిత,వ్యాసకర్త ,సాందీపని ఎడిటర్ ,రాష్ట్రీయ కళామంచ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తనని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కేంద్ర చలనచిత్ర బోర్డు సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ … ధృడమైన విశ్వాసంతో నా పై ఉంచిన బాధ్యతలకి న్యాయం చేస్తానని అన్నారు .