రెండో సంవత్సరం డైట్ విద్యార్థులకు 10 నుండి పరీక్షలు

0
19 Views

వికారాబాద్:  డైట్ కళాశాల రెండవ సంవత్సరం ఛాత్రోపాధ్యాయులకు నవంబర్ 10 నుండి నవంబర్ 16 వరకు పరీక్షలు నిర్వహించబడతాయని డైట్ కళాశాల ప్రధానాచార్యులు పి. జానీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రైవేటు డైట్ కళాశాల 2020-22 రెండో సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని పొందవచ్చునని ఆయన ఆ ప్రకటన తెలిపారు.