ధారుర్ మండలం బాచారం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… ఆటోను ఢీ కొట్టిన లారీ..నలుగురు మృతి..ఏడు మందికి గాయాలు

0
17 Views

వికారాబాద్:ధారుర్ మండలం బాచారం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను  లారీ ఢీ కొట్టగా ఆటో డ్రైవర్ తో సహా నలుగురు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.:సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు స్థానికుల నానా ఇబ్బందులు పడ్డారు. క్రషర్ మిషన్లో పనిచేసేందుకు మదనంతాపూర్ తండా నుండి కూలీలు ఆటోలో వస్తుండగా ధారూరు మండలం కెరెల్లి రైతు వేదిక సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తో సహా నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి తోడు సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు చేయని ప్రయత్నం అంటూ లేదు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం ఆనీ స్థానికులు చెబుతున్నారు. మృతులు హేమ్ల, రవి, కిషన్, ఆటో డ్రైవర్ జమీల్ ఉన్నారు. పోలీసుల  లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.